బాబోయ్.. ఖాలి వాటర్ బాటిల్.. దొంగను పట్టించింది?
ఇక కొంతమంది అయితే నమ్మకంగా పనిచేసి సమయం సందర్భం చూసి ఇక తమ చేతివాటం చూపిస్తూ ఉన్నారు అని చెప్పాలి. దీంతో దొంగలను పట్టుకోవడం పోలీసులకు పెద్ద సవాల్ గా మారిపోయింది అని చెప్పాలి. అయితే ఇక్కడ ఒక దొంగ ఏకంగా కోటి రూపాయల విలువైన బట్టలను చోరీ చేశాడు. అయితే అలాంటి దొంగను ఒక ఖాలి వాటర్ బాటిల్ పట్టించింది అని చెప్పాలి. వినడానికి విచిత్రంగా ఉన్న ఇది నిజంగానే జరిగింది. మధ్యప్రదేశ్లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 99.44 లక్షల విలువైన బట్టలను చోరీ చేసిన దొంగ ఒక వాటర్ బాటిల్ తాగి బాటిల్ను అక్కడే పడేశాడు.
ఇక ఆ బాటిల్ ఆధారంగానే పోలీసులు చివరికి దొంగను పట్టుకోగలిగారు. తానే జిల్లా భీమండి పటంలోని ఓ గోదాంలో భారీ దొంగతనం జరిగింది. గుర్తు తెలియని నిందితుడు దాదాపు కోటి రూపాయల విలువైన బట్టలను ఎత్తుకెళ్లాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కానీ పెద్దగా పురోగతి లభించలేదు. అయితే చోరీ జరిగిన స్థానంలో దొరికిన ఖాళీ వాటర్ బాటిల్ తో కనిపించగా ఇక దాని ఆధారంగా విచారణ చేపడితే.. ఇక ఆ లేబుల్ ఉన్న బాటిల్ ఒక హోటల్లో బాటిల్ లేబుల్ తో సరిపోయింది. దీంతో అక్కడ సిసి టివి ఫుటేజీ గమనించి చివరికి నేర చరిత్ర ఉన్న నిందితుని పోలీసులు పట్టుకున్నారు అని చెప్పాలి