విడాకులు కావాలన్న భార్య.. భర్త ఏం చేశాడో తెలుసా?

praveen
కలకాలం కలిసి ఉండడానికి.. కష్టసుఖాల్లో తోడు ఉంటుంది అనే కారణంతో ఇక యువతి యువకులు అందరూ కూడా దాంపత్య బంధం లోకి అడుగుపెడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇంకొంతమంది ఇక సినిమాల్లో ఉండే భార్యాభర్తలను చూసి బాగా ప్రభావితం అయి పెళ్లి చేసుకుంటే ఇంత బాగుంటుంద అని ఆలోచనలో పడిపోయి ఇక ఏకంగా వివాహం చేసుకోవడానికి సిద్ధమవుతూ ఉంటారు. ఇంకొంతమంది ప్రేమ పెళ్లిళ్లు కూడా చేసుకుంటూ ఉంటారు. అయితే పెళ్లయిన తర్వాత దంపతులుగా మారిన తర్వాత మాత్రం ఒకరిని ఒకరు బాగా అర్థం చేసుకున్నప్పుడే ఆ దాంపత్య బంధం నిలబడుతూ ఉంటుంది.

 నువ్వెంత అంటే నువ్వెంత అనుకుంటే మాత్రం చివరికి పెళ్లయిన కొన్నేళ్లకే బంధం కాస్త పెటాకులుగా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో ఎంతోమంది యువతీ యువకులు ఇలా పెళ్లి చేసుకున్న తక్కువ సమయంలోనే చిన్న చిన్న గొడవల కారణంగా చివరికి దాంపత్య బంధానికి స్వస్తి పలుకుతూ విడాకులు తీసుకుంటున్న ఘటనలు కోకోళ్లలుగా వెలుగులోకి వస్తున్నాయి అని చెప్పాలి. ఇక మరి కొంతమంది ఇలా పెళ్లి కారణంగా జీవితం నాశనమైంది అనే మనస్థాపంతో బలవన్మరణాలకు పాల్పడుతున్న ఘటనలు కూడా అందరిని అవల్లయ్యేలా చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి.

 ఇక్కడ ఇలాంటి విషాదకర ఘటన జరిగింది. పెళ్లయిన తొమ్మిది నెలలకే భార్య విడాకులు కావాలి అని కోరడంతో ఎంతో మనస్తాపం చెందాడు భర్త. ఇక ఇదే విషయాన్ని మనసులో పెట్టుకొని ఆలోచిస్తూ చివరికి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా ములుగు మండలం గంగాధర్ పల్లి గ్రామంలో వెలుగు చూసింది. ఏకంగా వెంకటేశం అనే 24 ఏళ్ల యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తూప్రాన్ మండలం దమ్మక్కపల్లి కి చెందిన లాస్యను పెళ్లి చేసుకున్నాడు వెంకటేశం. అయితే పెళ్లి అయిన మూడు నెలల నుంచి గొడవలు మొదలయ్యాయి. చివరికి విడాకులు తీసుకోవాలని లాస్య నిర్ణయించడంతో మనస్థాపంతో వెంకటేశం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: