కర్ణాటక మహిళ మర్డర్ మిస్టరీ వీడినట్టేనా... డబ్బే హత్యకు కారణమా?

VAMSI
కర్ణాటక రాష్ట్రానికి చెందిన మహిళ ఆంధ్రప్రదేశ్ లో అనుమానాస్పదంగా హత్య కాబడడం సంచలనంగా మారింది. ఈ మృతదేహాన్ని అన్నమయ్య జిల్లా మొలకలచెరువు మండలం మద్ది నాయనిపల్లికి సమీపంలో ఉన్న అడవిలో పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు ఈమెను పథకం ప్రకారం ముందుగా హత్య చేసి ఆ తర్వాత పూడ్చి పెట్టారని తెలిపారు. పోలీసుల విచారణలో చనిపోయిన మహిళ ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఉప్పరోళ్ళపల్లి వాసి హేమవతి గా గుర్తించారు. ఈమె అన్నమయ్య జిల్లాలో నివసిస్తోంది ..అయితే బ్రతుకు జీవనం కోసం కర్ణాటకలో చిక్ బల్లపుర్ జిల్లా తాటకంవారి హల్లి లో ఉండేది.
కాగా ఆమె తరచూ బి కొత్తకోట లోని తన కూతురు భవానీ దగ్గరకు రావడం వెళ్ళడం చేస్తూ ఉండేదట. అయితే ఎప్పటిలాగే ఇంటికి వచ్చిన హేమలత...చెప్పకుండా ఇంటి నుండి బయటకు వెళ్లి ఎంతకీ రాకపోవడంతో భయపడిన ఈమె కూతురు భవానీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలా విచారణ స్టార్ట్ చేసిన పోలీసులు ఎట్టకేలకు కేసును చేధించారు. హేమవతి కి తన కూతురు ఊరిలో శ్రీకాంత్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఆ పరిచయం కాస్త అక్రమ సంబంధం గా మారి ఒకరికి ఒకరులా  మారిపోయారు. అదే చనువుతో హేమవతి అప్పుడప్పుడు తన దగ్గర ఉన్న డబ్బును అతని వద్ద దాచమని ఇచ్చిందట.
అలా కొంత మొత్తం అతని వద్ద పొదుపు చేసుకుంది.. అయితే ఒకరోజు డబ్బులు అవసరం అని అడిగిందట..కానీ శ్రీకాంత్ కు డబ్బు మోజుతో ఇవ్వడానికి నిరాకరించి..ఎలాగైనా కాజేయ్యాలని ప్లాన్ మనసులో అనుకున్నాడు. అందుకే ఆమెను డబ్బులు ఇస్తాను రమ్మని చెప్పి వచ్చాక చంపేసి బి కొత్తకోట అడవిలో పూడ్చి పెట్టాడట.  అయితే ఈ డబ్బులు విషయం మాత్రం పోలీసులకు తన కుమారుడు చెప్పాడట. ఆ తర్వాత శ్రీకాంత్ ను అదుపులోకి తీసుకుని విచారించగానే అన్ని నిజాలు బయటపడ్డాయి. డబ్బు కోసం మహిళను హత్య చేసిన పాపానికి కటకటాల పాలయ్యాడు శ్రీకాంత్...దీనితో వారి కుటుంబం సైతం వీధిన పడింది.. అందుకే ఏదైనా ఒక పని చేసే ముందు విచక్షణతో ఆలోచించాలి.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: