ఓరి నాయనో.. సైకో ఎంత పని చేశాడు?

praveen
ఇటీవల కాలంలో సభ్య సమాజంలో మానవత్వం ఉన్న మనుషులు కంటే ఉన్మాదులుగా  మారిపోతున్న మనుషులు ఎక్కువగా కనిపిస్తున్నారు. చిన్నచిన్న కారణాలకే,  కొన్నిసార్లు అయితే కారణాలు కూడా లేకుండానే ఏకంగా ఎదుటి వ్యక్తులపై దాడులకు పాల్పడుతూ బీభత్సం సృష్టిస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. వెరసి ఎప్పుడు ఎవరు ఎటువైపు నుంచి దాడి చేస్తారో అని ప్రతి ఒక్కరు కూడా భయపడుతూనే బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడింది నేటి రోజుల్లో. మద్యం మత్తులో మానసిక సమస్యలతో బాధపడే కొంతమంది యువకులు సృష్టించే బీభత్సం అంత ఇంతా కాదు. ఇక ఇటీవల శ్రీకాకుళం జిల్లాలో కూడా ఇలాంటి ఓ దారుణ ఘటన వెలుగు చూసింది.

 శ్రీకాకుళం జిల్లా పలాసలో ఓ సైకో వీరంగం సృష్టించాడు అని చెప్పాలి. వృద్ధుడి తల పగలగొట్టి ఏకంగా దారుణానికి పాల్పడ్డాడు. ఇక సైకో ఇలా ఉన్మాదిలా ప్రవర్తించడంతో స్థానికులు అందరూ కూడా అతని చూసి భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన కాస్తా స్థానికంగా సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి. పలాస - కాశీబుగ్గ మున్సిపాలిటీలోని కాశిబుగ్గ పెట్రోల్ బంక్ సమీపంలో ఒక టీ దుకాణం ఉంది. అయితే ఈ దుకాణం దగ్గర కామరాజు అనే వృద్ధుడు చాయ్ తాగుతున్నాడు. అకస్మాత్తుగా అక్కడికి ఎంట్రీ ఇచ్చాడు ఒక సైకో.

 కారణం లేకుండానే టీ తాగుతున్న వృద్ధుడు తలపై కర్రతో దారుణంగా దాడికి పాల్పడ్డాడు. విచక్షణ రహితంగా దాడి చేశాడు. అతని ఆపేందుకు చుట్టుపక్కల వారు రాగ వారిపై కూడా దాడి చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో సైకో తీరుతో అందరూ భయాందోళనకు గురయ్యారు.. అయితే తలకు గాయమై రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న వృద్ధుడు కామరాజును చూసిన స్థానికులు పలాసలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. ఆ తర్వాత ఎంతో చాకచక్యంగా వ్యవహరించి సైకోని పట్టుకొని దేహశుద్ధి చేశారు. చివరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అతని అరెస్టు చేసి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: