భర్తకు ప్రేమగా పాలు ఇచ్చిన భార్య.. కానీ ఉదయం చూసేసరికి?

praveen
ఇటీవలి కాలంలో ఎంతో మంది యువకులు మాయ మాటలతో నమ్మించి యువకులను ఆకర్షించి  దోచుకుంటూన్నా  సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. మరికొంతమంది పెళ్లి చేసుకుంటున్నాము అంటు నమ్మించి  చివరికి నిండా ముంచేస్తున్నారు. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. ఆమెకు మూడు నెలల క్రితం వివాహం జరిగింది. అయితే ఎందుకో  వివాహం తర్వాత పుట్టింట్లోనే ఉండిపోయింది. ఇటీవలే భారీ ఊరేగింపు మధ్య అత్తారింటికి వచ్చింది.  ఇక ఎంతో ప్రేమగా వచ్చిన తొలి రోజే భర్త  కు పాలు కలిపి ఇచ్చింది. దీంతో భర్త  ఎంతగానో మురిసిపోయాడు. అత్తమామలకు రోటీలు కూడా చేసి ఇచ్చింది.

 తర్వాత అందరూ హాయిగా నిద్ర పోయారు. కానీ ఉదయం లేచి చూసే సరికి అందరూ షాక్.  ఎక్కడ కోడలు  ఇంట్లో కనిపించలేదు. సీసీ టీవీ పుటేజ్ పరిశీలించగా అప్పుడు షాకింగ్ విషయం బయటపడింది. ఉత్తరప్రదేశ్లోని సంభాల్ నగరంలో ఈ ఘటన  వెలుగులోకి వచ్చింది. అంకుష్  అనే  వ్యక్తికి మూడు నెలల క్రితం శివపురి తో వివాహం జరిగింది. పెళ్లయిన తర్వాత శివపురి ఎక్కువకాలం పుట్టింట్లోనే ఉండిపోయింది. తల్లిదండ్రుల బలవంతం మీద అత్తారింటికి వెళ్ళింది.  తొలిరోజు భర్తకు పాలు ఇచ్చి  అత్తమామలకు ఎంతో ప్రేమగా రోటీలు  చేసింది. కానీ ఆ తర్వాత రోజు కానీ అర్థం కాలేదు పాలు, అత్తమామలకు ఇచ్చిన రో rటీలలో నిద్రమాత్రలు కలిపింది అని . వాళ్ళు  నిద్రపోయిన తర్వాత శివపురి ప్రియుడితో కలిసి వెళ్లిపోయింది. ఇది తెలుసుకున్న వరుడు కుటుంబ సభ్యులు చివరికి కేసు పెట్టగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 ఈ ఘటన స్థానికంగా సంచలనం గా మారిపోయింది అని చెప్పాలి.  సీసీ  టీవీ ఫుటేజ్  ను పరిశీలించిన సమయంలో శివపురి ఓ యువకుడితో వెళ్ళిపోయినట్లు కనిపించడం గమనార్హం. అంతేకాదు బీరువాలో  70 వేల రూపాయల నగదు లక్ష రూపాయల విలువ చేసే నగలు కూడా మాయమయ్యాయి అన్నది గ్రహించారు బాధిత కుటుంబ సభ్యులు. ఇక కోడలు చేసిన పనికి ఒక్కసారిగా అవాక్కయ్యారూ  అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: