ప్రియుడితో రాసలీలల కోసం భర్తను ఏం చేసిందంటే?

Chakravarthi Kalyan
ఓ మహిళ తను పనిచేసే ప్రదేశంలో ఓ వ్యక్తితో ఏర్పడిన వివాహేతర సంబంధం ఓ హత్యకు దారి తీసింది. కర్ణాటకలోని గుల్బర్గా జిల్లాకు చెందిన రమేష్‌కు వికారాబాద్‌ జిల్లాకు చెందిన వెన్నెలతో ఎనిమిదేళ్ల క్రితం పెళ్లయింది. వీరికి ముగ్గురు పిల్లలు. జీవనోపాధి కోసం హైదరాబాద్‌ వచ్చి కూలీలుగా పనిచేస్తున్నారు.

ఏడాది క్రితం వెన్నెలకు దస్తప్ప అనే వ్యక్తితో పరిచయమై వివాహేతర సంబంధానికి దారి తీసింది. వీరిద్దరి విషయం బయటపడింది. వెన్నెలకు, భర్త రమేష్‌కు గొడవలు జరిగాయి. రమేశ్‌ కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డికి భార్య పిల్లలతో మకాం మార్చినా భార్య తీరు మారలేదు. గత నెల 30 న భర్త హైదరాబాద్‌కు వెళ్లడంతో వెన్నెల తన ప్రియుడ్ని ఇంటికి పిలిపించుకుంది. రాత్రి రమేష్‌ అకస్మాత్తుగా ఇంటికి తిరిగి రావడంతో వారి రంకు బయటపడింది. రమేశ్ భార్యను నిలదీయడంతో ఆమె ప్రియుడు దస్తప్ప అతడి మెడకు తాడు వేసి గట్టిగా చుట్టేశాడు. వెన్నెల అతడికి సహకరించింది.

ఇద్దరూ కలిసి రమేశ్ ను చంపి.. నివాసం ఉంటూ పనిచేస్తున్న నిర్మాణ భవనంలోనే మృత దైహాన్ని పూడ్చి పెట్టారు. ఆ తర్వాత వెన్నెల ప్రియుడు దస్తప్ప అక్కడి నుంచి వెళ్లిపోయాడు. వెన్నెల కూడా అత్తగారిల్లు గుల్బర్గాకు వెళ్లిపోయింది. రమేష్‌ గురించి అతని కుటుంబ సభ్యులు అడిగితే ఎక్కడికో వెళ్లిపోయాడని చెప్పింది. రమేశ్‌ బంధువులు అతని కోసం ఎంతగానో తిరిగినా ఆచూకి దొరకలేదు.

కామారెడ్డిలోని ఎల్లరెడ్డికి వచ్చి స్థానికులను అడిగితే వారు  వెన్నెల వివాహేంతర సంబంధం గురించి చెప్పారు. అప్పుడు వెన్నెలను గట్టిగా నిలదీయడంతో అసలు విషయం చెప్పేసింది. ప్రియుడితో కలిసి హత్యచేసి అక్కడే పాతిపెట్టినట్లు వివరించింది. రమేశ్‌ బంధువుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు రమేశ్‌ మృతదేహాన్ని వెలికి తీసి అతని కుటుంబ సభ్యులకు అప్పగించారు. విషయం తెలిసిన రమేశ్‌ కుటుంబ సభ్యులు, బంధువులు వెన్నెల చేసిన దారుణంపై మండిపడతున్నారు. నిందుతులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: