పెళ్ళైన మూడో రోజే భర్తకు షాక్ ఇచ్చిన భార్య..చివరికి..
ఓ ఇద్దరు యువతి, యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నారనే కారణంగా రెండు కుటుంబాల మధ్య వైరం పెరిగింది.. అది కాస్త ఇప్పుడు ఏకంగా ఊరు ఊరినే టెన్షన్ లో పడేసింది. అక్కడ ఏం జరుగుతుంది అనే గ్రామస్తులు అంతా ఆలొచిస్తున్నారు.. కర్నూలు జిల్లా మంత్రాలయం లో ఘోరం జరిగింది. మంత్రాలయం మండలం మాధవరం గ్రామం లో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ప్రేమ పెళ్లి కారణంగా రెండు వర్గాల మధ్య వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ క్రమం లోనే ప్రేమించిన యువకుడి ఇంటికి యువతి బంధువులు నిప్పు పెట్టారు.
మాధవరం గ్రామాని కి చెందిన బోయ శ్రీజ రచ్చమర్రి గ్రామాని కి చెందిన భీమ ప్రేమించుకున్నారు. ఈ క్రమం లో నే జూన్ ఈ నెల 9వ తేదిన వివాహం చేసుకున్నారు. అయితే, వీరి పెళ్లి కి అంగీకరించని ఆ యువతి బంధువులు దాడి చేస్తారని భయపడి యువకుడి ఇంటిపాలిది ఇంటినుంచి పారిపోయారు. దీంతో కోపోద్రిక్తులైన యువతి బంధువులు అతని ఇంటి కి నిప్పంటించారు. ఇంట్లో ఉన్న బట్టలు, బియ్యం వంట సామాగ్రి పూర్తిగా కాలి బూడిదయ్యాయి. దీంతో గ్రామాం లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు భారీగా మోహరించారు. మాధవరంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.. ఈ ఘటన గురించి పూర్తీ వివరాలు తెలియాల్సి ఉన్నాయి.