మితి మీరుతున్న పబ్ లు..మౌనంగా అధికారులు..కారణం?
నగరంలో పబ్ కల్చర్ పెరిగిపోతోంది. దీంతో పబ్ నిర్వాహకులు ఇష్టారీతిలో రూల్స్ను బ్రేక్ చేస్తూ పబ్స్ నిర్వహిస్తున్నారు.ఒకప్పుడు మద్యం మాత్రం ఉన్న పబ్ లో ఇప్పుడు డ్రగ్స్, వ్యభిచారం కూడా జరుగుతున్నట్లు దాడులు జరిగినప్పుడు వెలుగు చూస్తున్నాయి.కబ్ల్ మస్తీ పబ్ చీకటి గుట్టు బయటలకు వచ్చింది. మరో పబ్పై ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు.వివరాల ప్రకారం.. కేపీహెచ్బీలో మంజీరా మెజిస్టిక్ కమర్షియల్లోని క్లబ్ మస్తీ పబ్లో మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. పబ్లో యువతులతో అర్ధనగ్న నృత్యాలు నిర్వహిస్తున్నట్టు గుర్తించారు.
అంతేకాకుండా పబ్ యజమాన్యం పరిమితికి మించి డీజే సౌండ్తో పబ్ నడుపుతోంది. ఈ పోలీసుల దాడుల్లో భాగంగా పబ్లో 9 మంది యువతులు, మేనేజర్ ప్రదీప్, డీజే ఆపరేటర్ను అదుపులోకి తీసుకున్నారు.పబ్ యజమాని శివప్రసాద్, మేనేజర్లు, కృష్ణ పరారీలో ఉన్నారు. ఇక, డీజే మిక్సర్, హుక్కా ప్లేయర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. అనంతరం ఎస్ఓటీ పోలీసులు నిందితులను కేపీహెచ్బీ పోలీసులకు అప్పగించారు. అయితే, కస్టమర్లను ఆకర్షించేందుకే పబ్ యాజమాన్యం అమ్మాయిలతో ఇలా అర్ధనగ్న డ్యాన్స్ లు చేయిస్తున్నారని సమాచారం..మైనర్ లకు పబ్ లో ఎంట్రీ ఇవ్వడం వల్ల దారుణాలు జరుగుతున్నాయని కొందరు అభిప్రాయ పడుతున్నారు..