పెళ్ళైన 5 నెలలకే.. ఆ డాక్టర్ ఏం చేసిందో తెలుసా?

praveen
ఇటీవలి కాలం లో పెళ్లి చేసుకొని కోటి ఆశల తో మెట్టినింట్లో అడుగు పెడుతున్న ఆడ పిల్లలకు కొన్నాళ్ల తర్వాత ఊహించని చిత్ర హింసలు ఎదురవుతున్నాయి. కలకాలం తోడు నీడగా నిలుస్తాను అంటూ ప్రమాణం చేసిన భర్త అదనపు కట్నం కావాలంటూ వేధిస్తూ ఉండడం.. ఇక భర్తతో పాటు అత్త మామలు కూడా బెదిరింపులకు  పాల్పడుతూ ఉన్న నేపథ్యం లో మెట్టినింట్లో అడుగు పెట్టిన ఆడపిల్ల జీవితం దుర్భరం గా మారి పోతుంది. ఒకవైపు అదనపు కట్నం కోసం తల్లి దండ్రులను  అడిగి ఇబ్బందులు పెట్టలేక మరోవైపు అత్తింటి వారి వేధింపులు తాళలేక చివరికి ఆత్మహత్యలే శరణ్యం అనుకుంటూ బలవన్మరణాలకు పాల్పడుతున్నారు ఎంతోమంది.

 ఇటీవలే హైదరాబాద్ నగరంలోని ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది.. సూర్యోదయ నగర్లో నివాసముంటున్న 31 సంవత్సరాల భారతి ఇటీవలే ఇంట్లో చనిపోయి కనిపించింది.. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు వెంటనే హైదరాబాద్కు చేరుకుని బోరున విలపించారు. ఇక విషం తాగి సూసైడ్ చేసుకున్న తన భర్త రమేష్ అత్తమామలు పోలీసులకు తెలిపారు.అటు భారతి తల్లిదండ్రులు మాత్రం అదనపు కట్నం కోసం వేధింపులు తాళలేక కూతురు ఆత్మహత్య చేసుకుంది అంటూ ఆరోపిస్తూ ఉండటం గమనార్హం.

 మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నర్సాపూర్ కు చెందిన భారతి గత ఏడాది డిసెంబర్లో కరీంనగర్ జిల్లా జమ్మికుంట కు చెందిన డాక్టర్ కొండగట్టు రమేష్ తో వివాహం జరిగింది. వరుడు కోరిక మేరకు కట్నకానుకలు ఇచ్చారు. భారతి తల్లిదండ్రులు కొన్నాళ్ళ వరకు కాపురం సజావుగా జరిగితే ఆ తర్వాత మాత్రం అతని నుంచి అదనపు కట్నం కోసం వేధింపులు మొదలయ్యాయి. ఇకపెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటుంది అనుకున్న కూతురు విగతజీవిగా మారడంతో ఆ తల్లిదండ్రుల గుండె పగిలిపోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు లోతుగా విచారణ జరుపు ఉండడం గమనార్హం..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: