వీడియో కాల్ లింకు పంపిన యువతి.. ఓపెన్ చేస్తే?
ఫేస్బుక్లో పరిచయమైన ఓ యువతి చివరికి యువకుడు కొంపముంచింది. వలపు వల వేసి ఖాతా నుంచి 2.5 లక్షల రూపాయలు కాజేసింది. దీంతో మోసపోయానని గ్రహించిన యువకుడు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటన బాపట్ల జిల్లా చీరాల మండలం హస్తినాపురం సమీపంలో వెలుగులోకి వచ్చింది. జాండ్రపేట కు చెందిన దేవన గణేష్ జీవనోపాధి కోసం ఉంగుటూరు మండలం చేబ్రోలు కు వచ్చాడు. గోపాలపురంలో సూపర్ వైజర్ గా పని చేస్తూ జీవిస్తున్నాడు. గత కొన్ని రోజుల క్రితమే అతనికి ఫేస్బుక్ ద్వారా ప్రీతి అనే యువతి పరిచయమైంది. ఆ తర్వాత టెలిగ్రాం వేదిక ఇద్దరు సందేశాలు పంచుకున్నారు. ఇక వీడియో కాల్ చేసుకుందామని యువతి ఒక లింకు గణేష్ మొబైల్ కి పంపింది.
ఈ క్రమంలోనే అతను కూడా లింకు ఓపెన్ చేసాడు. అయితే తన దగ్గర నెట్ బాలన్స్ లేవు 20 రూపాయలు తనకు పంపాలి అంటూ సూచించింది. 20 రూపాయలే కదా అని అతను కూడా పంపించాడు. కొద్దిసేపటికే అతని నుంచి 2.5 రూపాయలు ఖర్చు అయినట్టు చరవాణి కి సందేశం వచ్చింది. దీంతో ఒక్కసారిగా కంగు తిని బ్యాంకుకు వెళ్లి ఆరా తీశాడు. ఉత్తర్ ప్రదేశ్ లో ఉన్న ఒక బ్యాంకు ఖాతాకు బదిలీ అయినట్లు తెలిసింది. దీంతో మోసపోయాను అని గ్రహించి పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..