ప్రియుడి మోజులో భర్తను చంపడానికి భార్య మాస్టర్ ప్లాన్..
వివరాల్లొకి వెళితే.. ఈ ఘటన ఆంధ్ర ప్రదేశ్ లో వెలుగు చూసింది.అనంతపురం జిల్లా ధర్మవరంలో పల్లపు లక్ష్మిదేవి, గంగాధర్ కుటుంబం ఉండేది. గంగాధర్ వడ్డీ వ్యాపారుల వద్ద దాదాపుగా ఎనిమిది లక్షల రూపాయలు అప్పులు చేశాడు. ఈ అప్పుల్నే అతడి భార్య హత్యకు కారణంగా వాడుకుంది. అతడి భార్య లక్ష్మిదేవి ధర్మవరంలోని తారకరామాపురానికి చెందిన భాస్కర్ రెడ్డితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ సంబంధానికి భర్త అడ్డుగా ఉండడంతో భార్య లక్ష్మిదేవి దారుణమైన పన్నాగం పన్నింది. హత్య చేసి వడ్డీ వ్యాపారుల ఖాతాలోకి వేస్తే అప్పుకు అప్పు, అడ్డుగా ఉన్న భర్త ఇద్దరి పీడ విరగడ అవుతుందని భారీ స్కెచ్ వేసింది.
భర్తను చంపేందుకు సుపారి ఇచ్చి హత్య చేయించడానికి ప్లాను వేసింది.తన భర్తను వడ్డీవ్యాపారులే హత్య చేశారని పోలీసులుకు ఫిర్యాదు చేసింది. అప్పటికే ధర్మవరంలో ఇలాంటి ఘటనలు జరగడంతో మీడియా కూడా పోలీసుల వైఫల్యాలను ప్రశ్నించింది. దీంతో సీరియస్ గా తీసుకున్న పోలీసులకు విచారణలో నిందితురాలు లక్ష్మిదేవికి ఉన్న అక్రమ సంబంధం గురించి బయటకు వచ్చింది.ఆమె కాల్ డేటాను ఆధారంగా పోలీసులు తెలుసుకున్నారు.వివాహేతర సంబంధాల నేపథ్యంలో కట్టుకున్న భార్య, ఆమె కుటుంబ సభ్యులు హత్యకు పాల్పడటం సంచలనంగా మారింది. పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు..పూర్తీ వివరాలు తెలియాల్సి ఉంది.