రోడ్డు ప్రమాదంలో గాయాలు.. అలాగే రాస్తారోకో.. చివరికి?
చివరికి ఈ అనాలోచిత పని కారణంగా ఇప్పటికే తీవ్ర గాయాలపాలైన యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. నిజాంబాద్ జిల్లాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మండే ఎండల్లో మంచంపై పడుకోబెట్టి క్షతగాత్రుడితో రహదారిపై రాస్తారోకో చేయడంతో అనారోగ్యం కారణంగా పరిస్థితి విషమించి మృతి చెందాడు సదరు యువకుడు. కమ్మర్ పల్లి కి చెందిన భూమన అనే 33 ఏళ్ల వ్యక్తి తన స్నేహితుడు ఆటోడ్రైవర్ మారుతి తో కలిసి ఆటోలో ఊరికి బయల్దేరాడు. ఈ క్రమంలోనే ప్రమాదవశాత్తు ఆటో బోల్తా పడింది. ఇక ఈ ప్రమాదంలో భూమన్న వెన్నెముకకు తీవ్రంగా గాయమైంది.
అయితే భూమన్న తల్లి గంగవ్వ ఆటో డ్రైవర్ మారుతి పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే గాయం కారణంగా మంచంపై లేవలేని స్థితిలో ఉన్న భూమన్నను ఆటోడ్రైవర్ మారుతి ఆదుకోవాలని ఆర్థిక సహాయం చేయాలని భూమన్న కుటుంబ సభ్యులు నిజాంబాద్ కరీంనగర్ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. ఇక గంటలపాటు అలాగే ఎండలో క్షతగాత్రుడిని అలాగే ఉంచారు. తర్వాత సమాచారం అందుకున్న పోలీసులు కుటుంబ సభ్యులకు నచ్చజెప్పి క్షతగాత్రుడిని 108 అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలిస్తుండగా చివరికి మార్గ మధ్యంలోనే మృతి చెందాడు..