పుట్టగొడుగులు తిని.. 13 మంది మృతి?

praveen
సాధారణంగా జనాలు ఎప్పుడూ రొటీన్ ఫుడ్ తీసుకోకుండా అప్పుడప్పుడూ క్కాస్త కొత్తగా ఆలోచిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే రొటీన్ గా ఉండే కూరగాయలు కాకుండా ప్రోటీన్లు ఇచ్చే మరి కొన్ని వంటకాలు తినాలి అని అనుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే  అటు పుట్టగొడుగులు తినడానికి కూడా ఎంతోమంది ఇష్టపడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అంతే కాదు పుట్టగొడుగులు ఎంతోమందికి ఫేవరెట్ ఫుడ్ గా కూడా ఉంటుంది. ఇక మార్కెట్లో పుట్టగొడుగుల కి డిమాండ్ కూడా బాగానే ఉంటుంది అని చెప్పాలి. ఇక రెగ్యులర్ గా కూరగాయలు ఆకుకూరలు తినటం కంటే అప్పుడప్పుడు పుట్టగొడుగులు లాంటివి కూడా తినడం చేస్తూ ఉంటారు చాలా మంది.

 ఇక్కడ కొంతమంది వ్యక్తులు పుట్టగొడుగులు ఎంతో ఇష్టంగా తిన్నారు. కానీ అలా పుట్టగొడుగులు తినడమే చివరికి ప్రాణాలు పోవడానికి కారణం అవుతుంది అన్నది మాత్రం ఊహించలేకపోయారు. పుట్టగొడుగులు తిన్న కారణంగా ఏకంగా 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది ఆసుపత్రిలో చేరి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇక మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఘటన కాస్త ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం గా మారిపోయింది. అసోంలో ఈ విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది.

 దిబ్రూగఢ్ లో కొంతమంది వ్యక్తులు పుట్టగొడుగులను ఎప్పటిలాగానే తిన్నారు.  కానీ అది విషపూరితమైనవి గమనించలేదు. దీంతో 50 మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పుట్టగొడుగులు తిన్న కాసేపటికే 13 మంది ప్రాణాలు కోల్పోగా.. ప్రస్తుతం మరో 39 మంది అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నారు. పలువురి పరిస్థితి విషమంగా ఉందని ఇక మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది అని తెలుస్తూ ఉంది. ఇలా విషపు పుట్టగొడుగులు తిన్నవారిలో చాలామందికి కిడ్నీ లివర్ సమస్యలు తలెత్తుతాయని వైద్య పరీక్షల్లో నిర్థారణ అయింది. సంచలనంగా మారిన ఈ ఘటనపై  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: