విషం తాగిన ఆరుగురు బాలికలు.. ఎందుకో తెలుసా?

praveen
జనాలు పూర్తిగా పిరికివారు అయిపోయారు అబ్బా.. అదేంటండి ఒకేసారి అలా అనేసారు అని అంటారా.. ఇది నేను అంటున్నది కాదు ఐదు రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలే చెప్పకనే చెబుతున్నాయి. ఒకప్పుడు ఎలాంటి టెక్నాలజీ అందుబాటులో లేదు. ఏది కావాలన్నా ఎంతో కష్టపడి సంపాదించుకోవాల్సి ఉండేది. కానీ నేటి రోజుల్లో టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. అర చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లోనే ప్రపంచాన్ని చదివేసే అవకాశం ఉంది. ఇక ఏది కావాలన్నా ఎంతో సులభంగా సాధించుకునేందుకు ఎన్నో దారులు ఉన్నాయ్. ఇలాంటి సమయంలో కూడా చిన్న చిన్న సమస్యలు వస్తేనే భయపడి పోతున్నారు జనాలు. చివరికి అక్కడితో జీవితం ముగిసి పోయింది అని భావిస్తూ బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.

 ఇలా ఇటీవలి కాలంలో దేశంలో ఎక్కడో ఓ చోట తరచూ బలవన్మరణాలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి అని చెప్పాలి. ఇలా బలవన్మరణానికి పాల్పడటానికి  గల కారణాలు తెలిసి ప్రతి ఒక్కరూ ముక్కున వేలేసుకునే పరిస్థితి ఏర్పడుతోంది. ఇక ఇంత చిన్న కారణానికి కూడా బలవంతంగా ప్రాణాలు తీసుకుంటారా అని ప్రతి ఒక్కరూ అవాక్కయ్యే దుస్థితి ప్రస్తుత రోజుల్లో ఉంది అని చెప్పాలి.  ఇలాంటి ఘటనే జరిగింది ఇక్కడ. ఏకంగా ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఆరుగురు బాలికలు ఒకేసారి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు.

 ఈ ఘటన కాస్త రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇలా పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన వారిలో ముగ్గురు బాలికలు మృతి చెందగా మరో ముగ్గురు బాలికలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృత్యువుతో పోరాడుతూ ఉన్నారు. ఈ ఘటన బీహార్లోని ఔరంగాబాద్ లో వెలుగులోకి వచ్చింది. అయితే ఇలా ఆత్మహత్యాయత్నం చేసిన వారిలో ఒక బాలిక తన ప్రేమను స్నేహితురాళ్ల ద్వారా ఓ యువకుడికి తెలియజేసిందని.. అయితే ఆ బాలిక ప్రేమకు యువకుడు ఒప్పుకోలేదని దీంతో ఇక అందరూ బాధలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు అని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: