కోడలిపై కన్నెసిన మామ..పోలీసులకు చెప్పి..
వివరాల్లొకి వెళితే.. ఈ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్లో వెలుగు చూసింది.గుంటూరు జిల్లాలో ఓ మామ తన కోడలిని వేధిస్తున్న విషయం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది..సోమవారం జరిగే స్పందన కార్యక్రమంలో భాగంగా ఆమె ఈ విషయం గురించి చెప్పింది.తన సొంత మామయ్య తనను లైంగికంగా వేధిస్తున్నాడని కోడలు కలెక్టరుకు ఫిర్యాదు చేసింది. తన భర్త నైట్ షిఫ్టుకు డ్యూటీకి వెళ్లగానే వేధింపులు మొదలవుతాయని ఫిర్యాదులో పేర్కొంది..అతను ఎలాగైనా సరే ఆమెను పొందాలని వింత పనులు చేస్తూ భయ బ్రాంతులకు గురి చేసేవాడు.
తన భార్యకు పక్షవాతం రావడం తో ఆమె గత ఏడాది నుంచి ఆమె మంచానికే పరిమితం అయ్యింది. దాంతో అతను కోడలి పై కన్నెసాడు.ఎన్నో ఆస్పత్రుల్లో చూపించినా ఆమెకు నయం కాలేదు. మందులతో నెమ్మదిగా కోలుకుంటోంది. అప్పటి నుంచి తన తండ్రి వయస్సు ఉన్న మామయ్య ప్రవర్తనతో కోడలికి చుక్కలు కనిపిస్తున్నాయి. తరచూ చేతులు వేస్తూ వేధిస్తున్నాడు.. అలా చెయ్యాలని కోరాడు. ఆమె ఇంటి బాధ్యల కారణంగా అతని గురించి పట్టించుకోకుండా వుంది.భర్త చనిపోయిన ఎటువంటి లోటు రాకుండా చూస్తానని చెప్పడంతో బాధ పడింది. గతంలో ఏఎస్సైగా పని చేసినందున పోలీసు శాఖలో చాలా పలుకుబడి ఉందని, ఎవ్వరూ ఏమీ చేయలేరనే ఉద్దేశంతో బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది.. తనని అతని వేధింపుల నుంచి రక్షించాలని విజ్ఞప్తి చేసింది..