భర్తను పంచుకున్న భార్యలు.. కథ ఏంటంటే?
ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.. ఇది విన్న ప్రతి ఒక్కరూ కూడా నోర్లు వెల్ల బెట్టేలా చెస్తుంది. వివరాల్లొకి వెళితే.. ఉత్తరం ప్రదేశ్ లో వెలుగు చూసింది.అక్కడ ఓ వ్యక్తి మొదటి భార్య అనుమతితోనే రెండో వివాహం చేసుకున్నాడు. వివాహం అనంతరం అతడిని ఇద్దరు భార్యలు సమంగా పంచుకున్నారు. ఇది నిజంగా షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి.. విషయాన్నికొస్తే..రామ్పూర్ జిల్లాలోని ధోక్పురి తండా ప్రాంతానికి చెందిన వివాహితుడైన ఓ వ్యక్తికి కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియా ద్వారా ఓ యువతి పరిచయమైంది. ఉద్యోగ నిమిత్తం ఛండీగఢ్ వెళ్తున్నానని భార్యకు చెప్పి ఆ యువతితో అక్కడ సహజీవనం చేశాడు. దాంతో ఆ యువతి గర్భం దాల్చింది.
ఇక ఎలాగైనా అతను వదిలించుకొవాలని అనుకున్నాడు. తప్పించుకునేందుకు అక్కడి నుంచి పరారై స్వగ్రామానికి పారిపోయాడు. అతను మోసం చేశాడని తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేసింది.అనంతరం ఆ యువతి అతని దగ్గరకు వెళ్ళింది. అక్కడ అతన్ని పట్టుకొని నిలదీసింది.. పెద్ద గొడవ అయ్యింది. యువతిని వివాహం చేసుకునేందుకు నిందితుడి మొదటి భార్య అంగీకరించాల్సి వచ్చింది. ఇద్దరూ భార్యలతోనూ అతను ఆ గ్రామంలోనే కాపురం పెట్టాడు. ఈ క్రమంలో అతడిని ఇద్దరు భార్యలూ పంచుకున్నారు. మొదటి మూడు రోజులు మొదటి భార్య తో, తర్వాత మూడు రోజులు రెండో భార్యతో, ఆదివారం తల్లి దండ్రుల తో ఉన్నాడు.