మరి ఇంత దారుణం.. ఆరుగురు బాలురు కలిసి?

praveen
నేటి సభ్య సమాజంలో రోజురోజుకూ ఆడవారి రక్షణ ప్రశ్నార్థకంగానే మారిపోతుంది. రోజురోజుకు వెలుగులోకి వస్తున్న ఘటనలు  చూస్తుంటే ప్రతి ఆడపిల్ల ఈ లోకంలో ఆడపిల్లగా పుట్టడమే పాపమా అని బాధ పడే పరిస్థితులు వస్తున్నాయి. మానవత్వానికి కేరాఫ్ అడ్రస్ అయిన మనుషులు ఇప్పుడు మానవ మృగాలుగా మారిపోతున్నారు. ఆడపిల్ల కనిపిస్తే చాలు దారుణ అత్యాచారాలకు పాల్పడుతున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. మానవతా విలువలను మరిచి  కనీస మానవత్వం లేకుండా ఆడపిల్ల కనిపిస్తేచాలు అత్యాచారం చేస్తున్నాడు. అంతటితో ఆగకుండా దారుణంగా హత్యకు పాల్పడటం ఇలాంటివి కూడా చేస్తున్నారు.

 దీంతో ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు కూడా అడుగడుగున ఎక్కడ కామపు కోరలు వచ్చి దాడి చేస్తాయో అని భయపడుతూ బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా రోజురోజుకీ ఆడపిల్లల రక్షణ కర్త ప్రశ్నార్థకంగానే మారిపోతుంది. ఇక్కడ ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మైనర్ బాలికను ఆరుగురు మైనర్ బాలురు సామూహిక అత్యాచారం చేసిన ఘటన కర్ణాటకలో వెలుగులోకి వచ్చింది. ధార్వాడ జిల్లా లో నివాసముండే పదిహేనేళ్ల బాలిక ప్రస్తుతం పదవ తరగతి విద్యనభ్యసిస్తుంది. స్కూల్ వెళ్లి వస్తున్న సమయంలో మార్గమధ్యంలో ఒక యువతికి ఆరుగురు కాలేజీ యువకులు పరిచయమయ్యారు.

 ప్రతి రోజూ స్నేహితుల్లాగా బాలిక తో మాట్లాడటం మొదలు పెట్టారు ఆ ఆరుగురు యువకులు. అయితే స్నేహితులే కదా మాట్లాడుతుంది అని అనుకుంది ఆ బాలిక. కానీ వారి మనసులో ఉన్న నిజమైన బుద్ధుని మాత్రం ఊహించలేకపోయింది. ఇటీవలే యువకులు ఆ బాలికను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్ళి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత దృశ్యలను కెమెరాలో బంధించి ఎవరికైనా చెబితే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. ఏకంగా మూడు నెలల్లో ఆరుగురు ఆరు చోట్ల బాలికపై అత్యాచారానికి పాల్పడటం గమనార్హం. వేధింపులు తట్టుకోలేక పోయిన బాలిక ఇంట్లో వాళ్లకి అసలు విషయం చెప్పేసింది. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: