వెంకన్న సన్నిధిలో హైటెక్.. బేరాలన్నీ వాట్సాప్ లోనే

Podili Ravindranath
తిరుపతి వెంకన్న సాక్షిగా పడుపు వృత్తికి తెరలేపారు కొందరు అక్రమార్కులు. టెంపుల్ సిటీగా గుర్తింపున్న తిరుపతి పట్టణఁలో అత్యంత రహస్యంగా సాగుతున్న హైటెక్ వ్యభిచార దందా గుట్టును పోలీసులు బయటపెట్టారు. అసలు వ్యాపారం జరుగుతున్న తీరు చూసి బాబోయ్ ఇదేం స్టైల్ అని నోరెళ్లబెట్టారు కూడా. అసలు సూత్రదారులెవరో కనీసం అక్కడ ఉన్న అమ్మాయిలకు కూడా తెలియకుండా ఎంత సైలెంట్ గా బిజినెస్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇంకో విషయం ఏమిటంటే... వ్యాపారం చేసేది కూడా అమ్మాయిలే.. అదీ 25 ఏళ్ల లోపు యువతులే.
 తిరుపతి పట్టణంలోని శ్రీనగర్ కాలనీలోని ఓ అపార్ట్ మెంట్ లో వ్యభిచారం జరుగుతున్న విషయాన్ని  తెలుసుకున్న పోలీసులు... కొంతకాలం ఆ ఇంటిపై నిఘా ఉంచి.. పక్కా స్కెచ్ తో రైడ్ చేశారు. ఆ ఇంట్లోకి వెల్లేందుకు పోలీసులు కూడా విటులుగా మారారు. ముందుగా వారితో మాట కలిపి... ఆ తర్వాత పూర్తి వివరాలు సేకరించి... అప్పుడు అటాక్ చేశారు. ఆ దెబ్బతో రహస్యంగా సాగుతున్న వ్యభిచార దందా వెలుగులోకి రావడంతో... అపార్ట్ మెంట్ వాసులు అవాక్కయారు. ఇంత కాలం వీళ్లేనా మనతో ఉంది అని ఆశ్చర్యపోయారు.
విటులను ఆకర్షించేందుకు ఈ అమ్మాయిలు వాట్సాప్ లో ప్రత్యేక గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు. తెలిసిన వారి ద్వారా, రెగ్యులర్ కస్టమర్ల ద్వారా మాత్రమే వచ్చిన ఫోన్ కాల్స్ రిసీవ్ చేస్తారు. అంతా సేప్ అనుకున్న తర్వాత వారి దగ్గర ఉన్న అమ్మాయిల ఫోటోలను విటులకు పంపి రేటు మాట్లాడుకుంటారు. ఇక పేమెంట్ కూడా ఆన్ లైన్ లోనే. ముందుగా సగం అడ్వాన్స్ గూగుల్ పే చేస్తేనే విటులను ఇంటికి రానిస్తారు. లేదంటే... నో ఎంట్రీ. పోలీసులు కూడా విటుల ద్వారానే ఇంటి మీద రైడ్ చేసి నిర్వాహకులను అరెస్ట్ చేశారు. ఈ వ్యభిచార దందా నిర్వహిస్తోంది. ఇద్దరు మహిళలని తేలింది. కర్ణాటకలోని బళ్లారికి చెందిన స్వప్న, లక్ష్మీప్రియగా పోలీసులు గుర్తించారు. యువతుల పోటోలను సాయిచరణ్, అనిరుథ్ కుమార్ అనే ఏజెంట్ల ద్వారా విటులకు పంపుతూ... తెర వెనుక కథా, స్క్రీన్ ప్లే, దర్శకత్వం చేస్తున్నారు ఈ ఇద్దరు మహిళలు. బెంగళూరు, విశాఖ, రాజమండ్రి, గుడివాడ నుంచి యువతులను రప్పించి వారితో వ్యాపారం చేస్తున్నారని పోలీసు విచారణలో వెల్లడైంది. ఐదుగురు యువతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు... సదర్ హోమ్ కు తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: