100 మంది ప్రజల ఉసురు తీసిన ఇద్దరు ఉగ్రవాదుల ప్రతీకారం

SS Marvels
పశ్చిమ ఆఫ్రికా దేశం అయినటువంటి నైజర్‌ దేశంలో ఇస్లామిక్‌ ఉగ్రవాదులు నరమేధానికి పాల్పడ్డారు. మాలి సరిహద్దు వద్ద ఉన్న రెండు గ్రామాలపై విచక్షణారహితంగా దాడి చేసి దాదాపు 100 మంది ఆ దేశ పౌరులను పొట్టన బెట్టుకున్నారు. ఈ ఘటనపై నైజర్‌ ప్రధానమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉగ్రదాడి జరిగిన తోచబంగౌ‌, జారౌమ్‌దారే గ్రామాలను సందర్శించిన ఆయన అక్కడి ప్రజలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. శనివారం తమపై దౌర్జన్యం చేస్తున్న బోకోహారమ్‌ కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను గ్రామస్థులు కొట్టి చంపారు. దీనికి ప్రతీకారంతో రగిలిపోయిన ఆ ఉగ్రవాదులు ఈ రెండు గ్రామాలపై బాంబులు మరియు ఆయుధాలతో విరుచుకుపడ్డారు. విచక్షణారహితంగా దాడి చేసి వంద మందిని కాల్చి చంపారు. అలాగే ఈ ఘటనలో మరో 70 మందికి పైగా పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. బోకోహారమ్‌ ఉగ్రవాద సంస్థకు అల్‌ఖైదాతో సంబంధాలు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇక మృతుల్లో 70 మంది తోచబంగౌ గ్రామానికి చెందినవారని వెల్లడించారు. అలాగే మరో 75 మంది గాయపడ్డారని, వారిని రాజధాని నియామేలోని దవాఖానకు తరలించామని తెలిపారు.
 
 
 
 నైజర్... సంక్లిష్ట భద్రత, మానవతా సవాళ్లను ఎదుర్కొంటుంది. సుమారు 2 లక్షల ముప్పై వేల మంది శరణార్థులు కాగా, 2,50,000 మంది అంతర్గతంగా స్థానభ్రంశం చెందినవారికి ఆతిథ్యం ఇస్తుందని యునైటెడ్ నేషన్స్ ( యుఎన్ ) తెలిపింది. ఇక గత కొన్నేళ్లుగా ఇక్కడ బోకోహారమ్ ఉగ్రవాదులు వేళ్లూనుకున్నారు. గత నెలలో ఈ ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో 27 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో బోకోహారమ్ ఉగ్రవాదులు కిడ్నాప్‌లు, దాడులకు పాల్పడటం సర్వసాధారణం అయిపోయింది. ఇక నైజీరియాలోనూ ఇటీవల 400 మంది విద్యార్థులను కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. అలాగే, ఏడుగురు భారతీయులను డిసెంబరులో కిడ్నాప్ చేశారు. వీరు విదేశీయులు, ప్రముఖులను అపహరించి, డబ్బు డిమాండ్ చేస్తుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: