పాలతో రుచికరమైన కేక్ ఎలా తయారు చెయ్యాలో తెలుసుకోండి....

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...కేక్స్ అంటే ఇష్టపడని పిల్లలు ఉండరు.. కేక్స్ చాలా టేస్టీగా, యమ్మీగా ఉంటాయి. అందుకే పిల్లలు వీటిని ఎక్కువ ఇష్టపడతారు. కేక్స్ లో చాలా రకాలు ఉంటాయి. మనం రకరకాలుగా చేసుకుంటాము. చాక్లెట్ ఫ్లేవర్ అని వెన్నెల ఫ్లేవర్ అని స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అని ఇలా చాలా రకాలుగా మనం కేక్స్ ని తయారు చేసుకోవచ్చు. అయితే పాలతో తయారు చేసుకునే కేక్స్ చాలా రుచికరంగానే కాకుండా ఆరోగ్యకరంగా ఉంటాయి.పైగా ఈ కరోనా టైంలో ఇంట్లోనే నీట్ గా చేసుకోవడం మేలు. ఇక ఈ రుచికరమైన మిల్క్ కేక్ ఎలా తయారు చెయ్యాలో ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...
టేస్టీ మిల్క్ కేక్ తయారీకి  కావాల్సిన పదార్ధాలు...
పాలు - అరలీటరు,
పంచదార - పావు కప్పు,
నిమ్మరసం - ఒక స్పూను,
పిస్తా, బాదం పలుకులు - గుప్పెడు
పాలతో కేక్ తయారు చేయు విధానం చూడండి....
మందంగా ఉండే పాత్రలో పాలు పోసి స్టవ్ మీద పెట్టాలి. చిన్న మంట మీద మరిగించాలి. నిమ్మరసాన్ని పిండి నీళ్లలో కలిపి ఉంచాలి. పాలు మరుగుతున్నప్పుడు ఒక్కో చుక్కని అదులో కలుపుతూ ఉండాలి. ఒకేసారి ఎక్కువ పోస్తే పాలు విరిగిపోతాయి. కనుక పాలు విరిగిపోకుండా ఒక్కో చుక్క వేస్తూ కలుపుతూ ఉండాలి. పాలు చిక్కబడే వరకు ఇలా చేయాలి. పాలు చిక్కబడుతున్నప్పుడు అందులో పంచదార కలపాలి. తరువాత కూడా కోవాలా అయ్యే వరకు మరిగించాలి. కోవాలా దగ్గరకు చేరాక స్టవ్ కట్టేయాలి. ఇప్పుడు ఒక ప్లేటు అడుగుకు నెయ్యి రాసి బాదం పిస్తా ముక్కలు చల్లాలి. దానిపై కోవా మిశ్రమాన్ని వేయాలి. ఒక ఆకారంలో ఆ మిశ్రమాన్ని సర్ది చిన్న ముక్కలుగా కోసుకోవాలి.ఇక ఇలాంటి మరెన్నో రుచికరమైన వంటకాల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: