గూగుల్‌ పే, ఫోన్‌ పే వాడుతున్నారా.. జాగ్రత్త?

Chakravarthi Kalyan
ప్రస్తుత కాలంలో చేతిలో చిల్లిగవ్వ అవసరం లేకుండానే అంతా డిజిటల్ చెల్లింపులపై ఆధారపడుతున్నారు. ఎలాంటి చెల్లింపులైనా సరే ఫోన్ ఉంటే చాలు సులువుగా పని అవుతోంది. దీంతో అంతా వీటి ద్వారానే చెల్లింపులు చేస్తున్నారు. అయితే మీరు స్కాన్ చేసే క్యూ ఆర్ కోడ్ లతో రోజుకు పదుల సంఖ్యలో మోసాలు జరుగుతున్నాయి. వీటిపై ఎంత అవగాహన కల్పించినా బాధితులు నష్టపోతూనే ఉన్నారు. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మనిషి డిజిటల్ ప్రపంచం వైపు దూసుకుపోతున్నాడు.

ప్రతి రంగంలో డిజిటల్ వాడకం పెరిగిపోయింది. లావాదేవీల మొదలుకొని అన్నింటిలోను డిజిటల్ వైపు ప్రయాణం కొనసాగుతుంది. ఈ తరుణంలో సైబర్ కేటుగాళ్లు తమదైన శైలిలో డిజిటల్ మోసాలకు పాల్పడుతున్నారు.  ప్రస్తుతం టీ అమ్మేవాడి దగ్గర నుంచి కోట్ల విలువ చేసే వస్తువు వరకు అన్నింట్లో డిజిటల్ చెల్లింపులే సింహభాగం పోషిస్తున్నాయి.

పేమెంట్ యాప్స్ కు సంబంధించి పుంఖానుపుంకాలుగా యాప్స్ వస్తున్నాయి. వీటికి అలవాటు పడిన తర్వాత బ్యాంకులు మన కష్టార్జితాన్ని సులభంగా దోచుకుంటున్నాయి. డబ్బులు జమ చేయాలన్నా.. తీయాలన్నా.. ఏటీఎం లో పరిమితికి మించి నగదు డ్రా చేస్తే ఛార్జీలు ఇలా అన్నింటిపై సేవా పేరుతో మనల్ని నిలువుదోపిడీ చేస్తున్నారు. వీటిని మనం ప్రశ్నించలేం. ప్రభుత్వాలు కూడా వీటిపై మౌనం వహిస్తూ ఉంటుంది. వీటి నుంచి తప్పించుకునేందుకు పేమెంట్ గేట్ వేల వైపు జనం ఆసక్తి కనబరుస్తున్నారు.

అయితే వీటిని ఎవరు ఎప్పుడు దోచుకుంటారో తెలియడం లేదు. క్రమంగా జేబు దొంగలు, కన్నపు దొంగలు ఈ స్టేజీ నుంచి టెక్నాలజీ పై కొంచెం పట్టు సాధిస్తే చాలు. ఎదురు ఇంటికి వెళ్లకుండా మనం ఇంట్లోనే కూర్చొనే దొంగతనం చేయవచ్చు. ఇప్పుడు ఏటీఎంలు, డిజిటల్ చెల్లింపులు వచ్చాక జేబుల్లో డబ్బులు ఉండటం లేదు. కానీ సైబర్ మోసాలు మాత్రం విపరీతంగా పెరిగిపోతున్నాయి. వీటిని నియంత్రించడంలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలమవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: