ఐపీఎల్ కోసం ముఖేష్ కొత్త వ్యాపారం...!
ఈ మెగా టోర్నీ ప్రసార హక్కుల కోసం ఇప్పటికే ప్రముఖ కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఈ టోర్నీ ప్రసార హక్కుల ద్వారా మరింత ఆదాయం రాబట్టేందుకు బీసీసీఐ కూడా గట్టిగానే ప్రయత్నం చేస్తోంది. 2023- 2027 మధ్య కాలంలో 5 సంవత్సరాల కాలంలో జరిగే ఐదు టోర్నీలకు సంబంధించిన ప్రసార హక్కుల కోసం ఇప్పుడు బడా బడా సంస్థలు పోటీ పడుతున్నాయి. 2018- 2022 మధ్య కాలానికి సంబంధించిన ప్రసార హక్కుల గడువు వచ్చే ఏడాది టోర్నీతో ముగిస్తోంది. దీంతో రాబోయే ఐదేళ్ల కాలానికి 5 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని పొందేందుకు బీసీసీఐ ప్రయత్నం చేస్తోంది. రాబోయే ఐదేళ్ల కాలంలో ప్రసార హక్కుల కోసం ఇప్పటికే స్టార్ నెట్ వర్క్, సోనీ - జీ నెట్ వర్క్ సంస్థలు ఇప్పటికే పోటీ పడుతున్నాయి. అయితే ఇప్పుడు కొత్తగా రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థకు చెందిన జియో ఛానల్ కూడా బిడ్డింగ్లో పాల్గొంటోంది. ఇప్పటికే 16 వేల 347 కోట్ల రూపాయల విలువ చేసే బిడ్డింగులను బీసీసీఐ అందుకుంది. వచ్చే ఏడాది నుంచి ఈ టోర్నీలో మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి. 74 మ్యాచ్లు జరగనుండటంతో... బిడ్డింగ్ ధర రెట్టింపు అయ్యే అవకాశం ఉందని బీసీసీఐ అధికారులు భావిస్తున్నారు.