వందకే.. ఆన్ లైన్ బంగారం.. !
ఇంత చరిత్ర ఉంది భారత్ లో బంగారానికి. అందుకే ఇక్కడ బంగారం ఒక వస్తువు కాదు, అదొక భావన. బంగారు నగలు ధరిస్తే అదొక గౌరవం. కొందరు అదేదో బంగారు నగల కొట్టు మాదిరి ధరిస్తారు. వారికి అలా ధరించడం ఇష్టం, అది భారతీయులు మాత్రమే మోయతగ్గ వస్తువులు. ఇక పెళ్ళిలో అయితే నల్లపూసలు మొదలు, తాళి వరకు బంగారం లేనిదే పని ఒక్క అడుగు కూడా ముందుకు సాగదు. కట్నకానుకలు గురించి ఇక్కడ మాట్లాడవచో లేదో కానీ అందులో కూడా ఇదొక భాగం. కట్నం ఎంత ఇచ్చినా అందులో సగం మళ్ళీ పెళ్ళిపిల్లకు బంగారు నగలుగా పెట్టిపోతలలో ఇవ్వాల్సిందే. అందుకే బంగారం భారతీయులకు ఒక బాండాగారం.
ఇప్పుడు ఇది కరోనా కారణంగా ఆన్ లైన్ లో కూడా అందిస్తున్నారు. ఇదేమో పండుగల సీజన్, దీనితో బంగారం కొనుగోళ్ల కు కూడా సీజన్. దీనితో కొన్ని బంగారు విక్రయ సంస్థలు వారి విక్రయాలు పెంచుకునేందుకు ఆన్ లైన్ లో వందకే బంగారాన్ని అందిస్తున్నారు. లాక్ డౌన్ పుణ్యమా అని ఈ తరహా అమ్మకాలు ఎక్కువగా పెరిగిపోయాయి. టాటా తనిష్క్, కళ్యాణ్ జావెల్స్ తదితర సంస్థలు మరియు వీటి అనుబంధ సంస్థల నుండి ఆన్ లైన్ లో వందకే బంగారం కొనుక్కోవచ్చు. అలా కనీసం ఒక గ్రాము బంగారం కొన్న తరువాత దానిని డెలివరీ చేస్తారు. ఈ తరహా కొనుగోళ్ల వలన విక్రయాలు 200 శాతం పెరిగినట్టు ఆయా సంస్థలు చెపుతున్నాయి. ఎక్కువగా 3-4వేల మధ్య ఈ కొనుగోళ్లు జరుగుతున్నాయి, ఈ పండుగ సీజన్ లో ఇవి మరో 30 శాతం పెరిగే అవకాశం ఉందని సంస్త్లు అంచనా వేస్తున్నాయి.