జూమ్ కాల్ యాప్ ఇప్పుడు ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలిసిందే.. కరోనా కారణంగా వాణిజ్య వ్యాపార సంస్థలు, కార్యాలయాలు లాక్ డౌన్ కారణంగా మూత పడ్డాయి. దీంతో ఆయా సంస్థ యజమానులు జూమ్ కాల్ యాప్ ను అందుబాటులోకి తీసుకు వచ్చారు.ఆన్లైన్ ఆఫ్ లైన్ ను బదులు ఆన్ లైన్ మీటింగ్ లకే కాకుండా ఇంటర్వ్యూలు, తరగతుల వరకు అంతా ఆన్లైన్లోనే మారిపోయింది. ఒకటో తరగతి చదివే విద్యార్థుల నుంచి పీజీ చేసే స్టూడెంట్స్ వరకూ జూమ్ కాల్లో క్లాసులు వినాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి..
అయితే, నెట్ వర్క్ బాగుంటే సరి కానీ, లేకుంటే వారి పరిస్థితి మాత్రమే ఉంటుంది.. స్టూడెంట్స్ మాత్రం చెట్లు , పుట్టలు ఎక్కుతూ నానా కష్టాలను ఎదుర్కొన్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం అది బాగా ఫేమస్ అయ్యింది.అయితే జూమ్ వీడియో కాల్స్ చేసే సమయంలో బ్యాక్గ్రౌండ్ సరిగా ఉండక కొందరు ఇబ్బంది ఎదుర్కొంటుంటారు. అలా కాకుండా మీరు వీడియో కాల్లో మాట్లాడుతున్న సమయంలో మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ను సెట్ చేసుకునే అవకాశం ఉంటే భలే ఉంటుందనిపిస్తుంది..
ఇప్పుడు మళ్లీ లాక్ డౌన్ పెట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.. ఇక మళ్లీ జూమ్ కాల్ పనులు చేసుకోవాల్సిందే.. అయితే ఇలాంటి సమస్యలను అధిగమించడానికి డెవలపర్స్ అందుకోసమే సరికొత్త ఫీచర్ ను అందిస్తున్నది.ఇమ్మర్సివ్ వ్యు.. పేరుతో ఓ కొత్త ఫీచర్ను తీసుకొచ్చింది. దీని సహాయంతో మీ బ్యాక్గ్రౌండ్ను మీకు నచ్చినట్లు సెట్ చేసుకునే అవకాశం లభిస్తుంది. ఇందులో భాగంగా విద్యార్థులు తరగతి గదిలో కూర్చున్నట్లు, ఉద్యోగులైతే ఆఫీసుల్లో ఉన్నట్లు సెట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ను ఇతర దేశాల్లో ఉన్న జూమ్ యూజర్లకు అందుబాటులోకి ఉంది.. ప్రస్తుతం ఈ ఫీచర్ను డెస్క్టాప్ వెర్షన్లో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే మొబైల్లోనూ ఈ ఫీచర్ను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ప్రస్తుతం విదేశాల్లో అందుబాటులో ఉన్న ఈ ఫీచర్ను భారత్లోనూ తీసుకురానున్నట్లు జూమ్ పేర్కొన్నది.. మరి ఆ ఫీచర్ ఫలితం ఎంతవరకు ఉంటుందో చూడాలి..