గత వారం రోజులుగా ఎత్తు పల్లాలు చూస్తున్న స్టాక్ మార్కెట్ ఈ రోజు కాస్త లాభాలతో ముగిశాయి. వారం రోజులుగా నష్టాల బాటలో నడిచిన స్టాక్ మార్కెట్ రెండు రోజులుగా లాభాల బాటలో ఉన్న సూచీలు అలాగే కొనసాగాయి. సెన్సెక్స్ 60 పాయింట్లు లాభపడి 23709 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 19 పాయింట్లు ఎగబాకి 7211 పాయింట్లకు చేరింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.68.45 వద్ద కొనసాగుతోంది.
మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజిలో పీఎన్బీ, ఎస్బీఐ, హీరో మోటోకార్ప్, బోష్, ఆసియన్ పెయింట్స్ తదితర కంపెనీల షేర్లు లాభపడగా.. బీపీసీఎల్, మారుతి సుజుకి, బీహెచ్ఈఎల్, కోల్ ఇండియా, వేదాంత తదితర కంపెనీల షేర్లు నష్టపోయాయి