పరీక్షల లీకేజీలు అరికట్టేందుకు హైలెవల్‌ కమిటీ.. ఎవరెవరు సభ్యులంటే?

Chakravarthi Kalyan
పరీక్షలు పారదర్శకంగా,  నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. పరీక్షా విధానంలో సంస్కరణలు, డేటా సెక్యూరిటీ ప్రోటోకాల్స్‌లో మెరుగుదల, NTA నిర్మాణం,  పనితీరుపై సిఫార్సుల కోసం కేంద్రం కమిటీ ఏర్పాటు చేసింది. 2 నెలల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఏడుగురితో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసిన కేంద్రం.. చైర్మన్ గా ఇస్రో మాజీ చైర్మన్
డా. కె. రాధాకృష్ణన్ ను నియమించింది.
ఇక ఈ కమిటీ సభ్యులుగా.. ఎయిమ్స్ ఢిల్లీ మాజీ డైరెక్టర్, డాక్టర్ రణదీప్ గులేరియా, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం విసి ప్రొఫెసర్ బి జె రావు, IIT మద్రాస్ సివిల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ రామమూర్తి , కర్మయోగి భారత్ సహా వ్యవస్థాపకులు పంకజ్ బన్సల్, IIT ఢిల్లీ  స్టూడెంట్ అఫైర్స్ డీన్ ప్రొఫెసర్ ఆదిత్య మిట్టల్, కమిటీ సభ్య కార్యదర్శి గా  విద్యా మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి  గోవింద్ జైస్వాల్ వ్యవహారిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: