ఏపీ: ఎన్నికల్లో హింస జరిగితే.. టీడీపీకే లాభమా?

Chakravarthi Kalyan
ఈ సారి ఏపీలో ఎన్నికలు రంజుగా సాగుతున్నాయి. ఒకవైపు వైసీపీ.. మరోవైపు కూటమి ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచింది. తాము గెలుస్తామంటే.. తాము గెలుస్తామంటూ ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఇంకోవైపు విమర్శలు కూడా చేసుకుంటున్నారు. అయితే ఈ ఎన్నికల్లో గెలిచేందుకు అన్ని పార్టీలు సర్వ శక్తులు ఒడ్డుతుండటంతో పాటు.. అన్ని వనరులను తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నాయి.

ఆయా పార్టీలు చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ.. ఓటర్లను ప్రసన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పుడు ప్రచారం పీక్స్ కి చేరడంతో  సరికొత్త రాజకీయాలకు తెరతీశాయి.  ఇందులో భాగంగా చంద్రబాబు నాయుడు పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టి ప్రత్యర్థి పార్టీలపై దాడులకు ఉసిగొల్పుతున్నారు. ప్రస్తుతం ఏపీలో హింసా రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి.  రాజకీయ పార్టీల కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకుంటూ ప్రాణాలు తీసుకుంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే టీడీపీకి కావాల్సింది ఇదే అనే వాదన వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

tdp

సంబంధిత వార్తలు: