RSPపై మంద కృష్ణ మాదిగ ఫైర్?
ఈ పార్టీలు వివక్ష చూపుతున్నందున వారికి ఎన్నికల్లో ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్డి పార్టీ అనే ముద్ర ఉందని, ఎస్సీలకు రిజర్వ్ చేసిన స్థానాల్లో కూడా మాదిగలకు ప్రాధాన్యం లేదని వాపోయారు. మంత్రులుగా ఉన్న వారి కుటుంబాలకే మళ్లీ టికెట్స్ ఇవ్వడం బాధకరంగా ఉందని మంద కృష్ణ మాదిగ తెలిపారు. తన ముఖ్య మంత్రి కుర్చీని కాపాడుకోవటానికి సీఎం రేవంత్ రెడ్డి మాదిగలకు సపోర్ట్ చేస్తున్నారన్నారు. తరతరాలుగా తాము పార్టీల జెండాలు మోసేవారిగానే మిగిలిపోతున్నామని మంద కృష్ణ మాదిగ అన్నారు.