మంత్రి విడదల రజిని మూడు కోట్లు నొక్కేశారా?

Chakravarthi Kalyan
ఎమ్మెల్యే సీటు కోసం మంత్రి విడదల రజనికి 6 కోట్లు ఇచ్చినట్లు చిలకలూరి పేట వైసీపీ నేత మల్లెల రాజేష్ నాయడు ఇటీవల ఆరోపించారు. ఇప్పుడు ఆ పంచాయతీ ఏకంగా సీఎం వద్దకు చేరింది. పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జలకు ఫిర్యాదు చేస్తే 3 కోట్లు తిరిగి ఇచ్చారని తెలిపిన మల్లెల రాజేష్.. మిగిలిన డబ్బు ఇవ్వాలని మంత్రి రజనిని కోరితే దిక్కున్నచోట చెప్పుకోమన్నారని ఆరోపించారు. మల్లెల రాజేష్ ఆరోపనలు సంచలనం రేకిత్తించడంతో వ్యవహారంపై దృష్టి పెట్టిన సీఎం జగన్.. తాడేపల్లికి పిలిపించారు. మల్లెల రాజేష్ ను సీఎంవోలో  సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు. ఆ తర్వాత మల్లెల రాజేష్ ను సీఎం జగన్ పిలిపించి మాట్లాడారు.


విడదల రజని డబ్బు వసూలు చేసిన వ్యవహారంపై సీఎంకు మల్లెల రాజేష్ ఫిర్యాదు చేశారు. డబ్బు వసూలు చేసిన వ్యవహారంపై మల్లెల రాజేశ్‌ సీఎంకు సాక్ష్యాలు కూడా అందించినట్టు తెలిసింది. పంచాయతీ దృష్ట్యా సీఎంవో కు నరసారావు పేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ కూడా వచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: