రేవంత్‌ రెడ్డికి పొన్నంలేఖ.. ఏం రాశారంటే?

Chakravarthi Kalyan
తెలంగాణ రాష్ట్రానికి చెందిన గల్ఫ్ కార్మికుల సంక్షేమంపై చొరవ చూపాలని కోరుతూ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి ప్రత్యేకంగా లేఖ రాశారు. గల్ఫ్ దేశాల్లో మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా, గల్ఫ్ కార్మికుల సంక్షేమం, బోర్డు ఏర్పాటుకు వెంటనే చర్యలు చేపట్టాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా లేఖ రాశారు. అంతకు ముందు కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో 'గల్ఫ్ కార్మికుల సంక్షేమం, ఎన్నారైల సంక్షేమం' కోసం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని టిపిసిసి ఎన్నారై విభాగం చైర్మన్ డా. బి.ఎం. వినోద్ కుమార్, టిపిసిసి ఎన్నారై సెల్ కన్వీనర్ మంద భీంరెడ్డి, కాంగ్రెస్ పార్టీ గల్ఫ్ విభాగం కన్వీనర్ సింగిరెడ్డి నరేష్ రెడ్డి తదతరులు మంత్రి పొన్నం ప్రభాకర్‌ను హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం ఇచ్చారు.
దీంతో గల్ఫ్ అంశంపై తగిన చర్యలు తీసుకోవాలని సీఎం కార్యదర్శి షానవాజ్ ఖాసీంను మంత్రి ఫోన్‌లో కోరారు. తర్వాత సచివాలయాన్ని సందర్శించిన గల్ఫ్ సంఘాల ప్రతినిధులు సీఎం కార్యదర్శి షానవాజ్ ఖాసీంను, సాధారణ పరిపాలన శాఖ అధికారి చిట్టిబాబును కలిసి గల్ఫ్ సంక్షేమం ఫైల్ ను ముందుకు తీసికెళ్లాలని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: