విద్యుత్ వాహనాల రేట్లు తగ్గుతున్నాయి. అనేక కంపెనీలు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఇన్నాళ్లూ రేటు ఎక్కువ ఉందని వెనకాడినవారే ఇప్పుడు కొనే పరిస్థితి వచ్చేసింది. ఇన్నాళ్లూ విద్యుత్తు ద్విచక్ర వాహన ధర రూ.1-1.5 లక్షల వరకు ఉండేవి. మామూలు పెట్రోలు స్కూటర్లు, మోటార్సైకిళ్లు రూ.1 లక్షలో దొరికేవి. అందుకే విద్యుత్తు వాహనాల జోలికి జనం పెద్దగా వెళ్లలేదు. అయితే ఇపుడు విద్యుత్తు ద్విచక్ర వాహన కంపెనీలు రేట్లు బాగా తగ్గిస్తున్నాయి.
ఒక్కో వాహనంపై రూ.25,000 వరకు డిస్కౌంట్ దొరుకుతోంది. తాజాగా ఓలా ఎలక్ట్రిక్ తన ఎస్1 శ్రేణి స్కూటర్ల రేటు రూ.25,000 వరకు తగ్గించేసింది. ఎస్1 ప్రో, ఎస్1 ఎయిర్, ఎస్1 ఎక్స్+ వాహనాలకు ఓలా ఈ తగ్గింపును అందజేస్తోంది. దీంతో ఆ వాహనాలు రూ.79,999 నుంచి రూ.1,29,999 షోరూమ్ ధరకు అందుబాటులో ఉన్నాయి. మరి ఇంకెందుకు మీరు ట్రై చేయండి.
మరింత సమాచారం తెలుసుకోండి: