వలసలపై బీజేపీ టార్గెట్‌.. ఆ ఇద్దరు కమలం గూటికి?

Chakravarthi Kalyan
బీజేపీ వలసలపై దృష్టి సారించింది. తాజాగా మాజీ ఎంపీ సీతారాం నాయక్‌, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్‌ ను కాషాయగూటికి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే కాషాయ పార్టీ నేతలు ఈ ఇద్ధరు నేతలతో టచ్‌లోకి వెళ్లి సంప్రదింపులు జరిపారు. అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి అసంతృప్తితో ఉన్న సీతారాం నాయక్ తాజాగా మహబూబాబాద్ ఎంపీ టికెట్ ఆశించారు. కేసీఆర్ మాత్రం ఆ స్థానానికి సిట్టింగ్ ఎంపీ మాలోతు కవిత పేరునే ఖరారు చేశారు. అసంతృప్తిలో ఉన్న సీతారాం నాయక్ నివాసానికి భాజపా రాష్ర్ట అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్వయంగా వెళ్లి పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. కిషన్‌ రెడ్డి ఆహ్వానంపై సీతారాం నాయక్‌ సానుకూలంగా స్పందించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో భద్రాద్రి కొత్తగూడెం టికెట్ ఆశించి భంగపడిన జలగం వెంకట్రావు కూడా బీజేపీ వైపు చూస్తున్నారు. ఆయన మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ తో భేటీ అయ్యారు. వెంకట్రావుకు ఖమ్మం టికెట్ ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp

సంబంధిత వార్తలు: