కియా చూపించి కదిలిరా అంటున్న చంద్రబాబు?

Chakravarthi Kalyan
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నిర్వహిస్తున్న 'రా కదలిరా' సభలు ముంగిపుకు వచ్చాయి. ముగింపు సభను ఇవాళ శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో నిర్వహిస్తారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 23 చోట్ల 'రా కదలిరా' సభలు జరిగాయి. ఈ సీరిస్‌లో చివరి సభను  పెనుకొండ మండలం ఎర్రమంచి వద్ద నిర్వహిస్తారు.
గతంలో తెలుగుదేశం  ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన కియా... దాని అనుబంధ పరిశ్రమలకు మధ్య ఈ సభ ఏర్పాటు చేయనున్నారు. తెలుగుదేశం పార్టీ పెనుకొండ అభ్యర్థి  సవితకు చెందిన సొంత భూమిలో ఈ కదిలిరా సభ నిర్వహించనున్నారు. చంద్రబాబు నాయుడితోపాటు సభకు హాజరయ్యే ప్రజలకు కియా ప్రధాన పరిశ్రమతో పాటు, అనుబంధ పరిశ్రమలు కనపడేలా సభావేదికను తీర్చిదిద్దుతున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం ఎర్రమంచిలో తెలుగుదేశం నిర్వహిస్తున్న ఈ రా కదలిరా ముగింపును ప్రతిష్టాత్మకంగా నిర్వహించున్నారు. హిందూపురం పార్లమెంటు పరిధిలో నిర్వహిస్తున్న ఈ 24వ కార్యక్రమాన్ని ముగింపు సభగా టీడీపీ ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: