రేవంత్‌ ఫ్రీ గ్యాస్ సిలిండర్‌.. వీరికి మాత్రమే?

Chakravarthi Kalyan
రేవంత్ రెడ్డి ప్రభుత్వం తాజాగా మహాలక్ష్మి, గృహజ్యోతి పథకాలను ప్రారంభించింది. సచివాలయంలో ఈ 2 పథకాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వం.. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ పథకం కూడా ప్రారంభించింది. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ వల్ల పథకాల ప్రారంభ వేదికను చేవెళ్లలో కాకుండా సచివాలయానికి మార్చారు. ఇక్కడే పథకాలను సీఎం, మంత్రులు ప్రారంభించారు.

అంతేకాదు.. మహాలక్ష్మి'లో మరో గ్యారెంటీ అయిన రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకం జీవో విడుదల కూడా అయ్యింది. అయితే.. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న తెల్లరేషన్‌కార్డు దారులకు మాత్రమే  రు.500కే సిలిండర్‌ ఇస్తారు. గ్యాస్ కంపెనీలకు నెలవారీగా సబ్సిడీ ప్రభుత్వం చెల్లిస్తుంది. లబ్ధిదారులకు గ్యాస్ కంపెనీలు సబ్సిడీ డబ్బు బదిలీ చేయనున్నాయి. మూడేళ్ల సరాసరి ఆధారంగా సిలిండర్లు ఇస్తారు. సో.. అందరికీ కాదు. కొందరికే ఈ పథకం అని జనం అర్థం చేసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: