టికెట్ వచ్చిన టీడీపీ అభ్యర్థులకు చంద్రబాబు వార్నింగ్?
పార్టీల్లో ఎవరైనా అసంతృప్తితో ఉంటే వారిని ఒకటికి పదిసార్లు స్వయంగా వెళ్లి కలవాలని... కలుపుకునిపోయేలా జనసేనతో సమన్వయంతో వ్యవహరించాలని చంద్రబాబు అన్నారు. రెండు పార్టీలు సమన్వయంతో పని చేస్తేనే 100 శాతం ఓట్ల బదిలీ జరుగుతుందని చంద్రబాబు అన్నారు. 1.3 కోట్ల మంది అభిప్రాయాలు తీసుకున్నాక.. ఎన్నో సర్వేలు చేయించాక అభ్యర్ధులను ఎంపిక చేశానని చంద్రబాబు అన్నారు. దేశ చరిత్రలో ఇప్పటివరకూ ఏ పార్టీ కూడా ఇటువంటి ప్రయత్నం చేయలేదన్న చంద్రబాబు ఒక్క సీటూ ఓడిపోవడానికి వీలు లేదన్నారు.