ఇవాళే గ్రూప్2 పరీక్ష.. ఈ రూల్స్ మస్ట్?
గ్రూప్ 2 స్క్రీనింగ్ పరీక్ష కోసం 24 వేల 152 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. ప్రశ్నాపత్రాలు, జవాబు పత్రాలు,ఇతర సామాగ్రిని తరలించేందుకు 14 ఆర్టీసీ బస్సులు, 900 మంది ఎస్కార్ట్ సిబ్బందిని నియమించారు. పరీక్షా కేంద్రాల్లో విద్యుత్, తాగు నీటి ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్లు, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు సీఎస్ కె.ఎస్. జవహర్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.