కేసీఆర్కు పేరొస్తుందని..రేవంత్ ఆ పని చేయట్లేదా?
కరివెన, ఉద్దండాపూర్ నుంచి కేవలం కాల్వలు తవ్వితే నారాయణపేట - కొడంగల్ కు గ్రావిటీ తో నీరు పోతుందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. తాము మంజూరు చేసిన కాల్వల పనులు రద్దు చేసి నారాయణపేట - కొడంగల్ ఎత్తిపోతల చేపడుతున్నారని, జూరాలపై ఇప్పటికే ఒత్తిడి ఉంటే మళ్లీ అక్కడి నుంచే చేపడుతున్నారని నిరంజన్ రెడ్డి ఆక్షేపించారు. ఈ అంశంపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు.