బాబు రిటైర్‌మెంట్‌ను ప్రకటించిన భువనేశ్వరి?

Chakravarthi Kalyan
చంద్రబాబు రాజకీయాల నుంచి రిటైర్ అవుతున్నారా.. ఆయన కుప్పం నుంచి పోటీ చేయకుండా భువనేశ్వరిని రంగంలోకి దింపుతున్నారా.. తాజాగా కుప్పంలో నారా భువనేశ్వరి చేసిన ఈ వ్యాఖ్యలు కలకలం రేపాయి. తమాషాకు అంటున్నా అంటూ భువనేశ్వరి అంటున్నా.. దాన్ని వైసీపీ ఫుల్లుగా వాడేసుకుంటోంది. చంద్రబాబు రెస్ట్‌ తీసుకోవాల్సిన సమయం వచ్చిందని ఏకంగా భువనేశ్వరే చెప్పిందని అంటోంది.

తన భర్త రాజకీయాలకు ఇక పనికిరాడని.. అలసిపోయాడని.. మీడియా ముందుకొచ్చి నారా భువనేశ్వరి మాట్లాడారని వైసీపీ మహిళా నేతలు అంటున్నారు. అంతే కాదు.. హైదరాబాద్‌లోని ఏఏజీ ఆస్పత్రి కూడా చంద్రబాబు గురించి అదే చెప్పిందని.. బాబుకు సకల రోగాలు ఉన్నాయి. నువ్వు గానీ నడవాలంటే.. వెనుక ఒక అంబులెన్స్‌ ఉండాలని చెప్పిందని అంటున్నారు. ఇక బిజీ రాజకీయాలకు నువ్వు పనికిరావని రెస్టు తీసుకోవాలని ఆస్పత్రి రిపోర్టు ద్వారానే చెప్పినా.. చంద్రబాబు విన్లేదని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: