గ్రేటర్ హైదరాబాద్ బడ్జెట్ ఎంతో తెలుసా?
కాంగ్రెస్ కార్పొరేటర్ల విమర్శలపై స్పందించిన బీఆర్ఎస్ కార్పొరేటర్లు హైదరాబాద్ నగరంలో జరిగిన అభివృద్ధిని చూసి మాట్లాడాలని ఘాటుగా వ్యాఖ్యానించారు. కేటీఆర్ చేసిన అభివృద్ధిని చూసే నగరంలో ఓట్లు వేశారని బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు. కొందరు సభ్యుల డిమాండ్ తో పారిశుద్ధ్య నిర్వహణ, వాణిజ్య ప్రకటనల అక్రమాలపై హౌజ్ కమిటీ వేస్తున్నట్లు మేయర్ విజయలక్ష్మి ప్రకటించారు. విధుల్లో నిర్లక్ష్యం, ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులను ప్రభుత్వానికి సరెండర్ చేయనున్నట్లు మేయర్ తెలిపారు.