తెలంగాణలో బీజేపీ యాత్రల ప్లాన్ అదిరింది?
కరీం నగర్ , మెదక్ , జహీరాబాద్, చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో జరిగే యాత్రకు శాతవాహన అని.. అదిలాబాద్, పెద్దపల్లి, నిజమాబాద్ పార్లమెంట్ పరిధిలో జరిగే యాత్రకు కొమురం భీమ్ అని.. మహబూబ్ నగర్, నాగర కర్నూల్, నల్గొండ పార్లమెంట్ పరిధిలో జరిగే యాత్రకు కృష్ణా అని పేరు పెట్టారు. అలాగే వరంగల్, మహబూబ్ బాద్, ఖమ్మం పార్లమెంట్ పరిధిలో జరిగే యాత్రకు కాకతీయగా పేరు పెట్టారు. మార్చి మొదటి వారంలో పెద్ద బహిరంగ సభ పెట్టే యోచన లో బీజేపీ ఉంది.