ఖమ్మంలో కాంగ్రెస్కు ముచ్చెమటలు పట్టిస్తారట?
కాంగ్రెస్ ప్రభుత్వం ఫించన్లు, ఇళ్లు, రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి.. ఇంత వరకు ఆ ఊసే లేదని.. పొదుపు సంఘాలకు తాము డబ్బులు ఇస్తున్నామని.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటిలు తెలంగాణ ప్రజల పట్ల గారడీగా మారాయని కిషన్ రెడ్డి అన్నారు. ఆర్థిక వనరులు ఎట్లా సమకూర్చుకుంటుందో స్పష్టత లేదన్న కిషన్ రెడ్డి.. అప్పులు తీసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తోందన్నారు. రాబోయే రోజుల్లో ఆర్థిక సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని కిషన్ రెడ్డి హెచ్చరించారు.