వైద్యం అంటే హైదరాబాదేనా.. మారాల్సిందే?
కొడంగల్ లో మెడికల్, నర్సింగ్ కాలేజీల ఏర్పాటుకు పరిశీలించాలని రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. బీబీనగర్ ఎయిమ్స్ లో పూర్తిస్థాయి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకు రావాలని... దానివల్ల ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల ప్రజలకు ప్రయోజనం కలుగడంతో పాటు.. ఉస్మానియా, నిమ్స్ ఆస్పత్రులపై భారం తగ్గుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎయిమ్స్ ను సందర్శించి పూర్తి స్థాయి నివేదిక తయారు చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డిని.. అవసరమైతే తానే స్వయంగా కేంద్రమంత్రిని కలిసి వివరిస్తానన్నారు.