జోక్యం కుదరదు.. బాబుకు షాక్ ఇచ్చిన హైకోర్టు?
స్పీకర్ నోటీసును సవాల్ చేస్తూ ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. మండలి ఛైర్మన్ నోటీసును సవాల్ చేసిన ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య కూడా పిటీషన్ వేశారు. హైకోర్టులో ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు ఈ దశలో తాము జోక్యం చేసుకోలేమని తెలిపింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు హైకోర్టు ఆదేశం ఇచ్చింది. విచారణను ఫిబ్రవరి 26కు వాయిదా వేసింది.