కేరళలో కరోనా విజృంభణ.. ఆంధ్రాలో అలర్ట్‌?

Chakravarthi Kalyan
కేరళ సహా ఇతర రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. కొన్ని చోట్ల మరణాలు కూడా నమోదవుతున్నాయి. దీంతో కేంద్రం, ఇతర రాష్ట్రాలు అప్రమత్తం అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోనూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఏపీలో సన్నద్ధతపై సమీక్షించిన వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు.. విలేజి హెల్త్ క్లీనిక్ లలో ర్యాపిడ్ టెస్ట్ కిట్లను సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. శబరిమలై యాత్రకు వెళ్లే భక్తులు తగినంత ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్య కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు సూచనలు జారీ చేశారు.

 
ఎలాంటి వ్యాధి లక్షణాలు కన్పించినా దగ్గర్లోని విలేజి హెల్త్ క్లీనిక్ లలో పరీక్షలు చేయించుకోవాలని ముఖ్య కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు చెబుతున్నారు. కోవిడ్ కొత్త వేరియంట్ సన్నద్ధతపై వైద్యారోగ్యశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్య కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు..
ప్రభుత్వ ఆస్పత్రుల్లోని ఆర్టీపీసీఆర్ ల్యాబ్ లను క్రియాశీలకం చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు. ఫ్లూజ్వరం లేదా శ్వాసకోస సమస్యలతో బాధపడుతున్న రోగులకు ఆర్టీపీసీఆర్ టెస్టులను తప్పనిసరి చేయాల్సిందని ఆదేశించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: