మరో షాక్‌: బీఆర్‌ఎస్‌ నేత గుండెపోటుతో మృతి?

Chakravarthi Kalyan
తెలంగాణ ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుసటి రోజే ఆ పార్టీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన జనగామ జెడ్పీ ఛైర్మన్ సంపత్ రెడ్డి గుండెపోటుతో మరణించారు. ఆకస్మత్తుగా అస్వస్థతకు గురైన జనగామ జెడ్పీ ఛైర్మన్ సంపత్ రెడ్డిను హుటాహుటిన హనుమకొండలోని ఓ ఆస్పత్రి తరలించారు. అక్కడ జనగామ జెడ్పీ ఛైర్మన్ సంపత్ రెడ్డి చికిత్స పొందుతూ మరణించారు.
జనగామ జెడ్పీ ఛైర్మన్ సంపత్ రెడ్డి హఠాన్మరణంపై కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమం తొలినాళ్ల నుంచి వెంట నడిచిన సంపత్ రెడ్డి మరణం బాధాకరమని కేసీఆర్ అన్నారు. సంపత్ రెడ్డి కుటుంబ సభ్యులకు భారాస అండగా నిలుస్తుందని కేసీఆర్ తెలిపారు. పాకాల సంపత్ రెడ్డి మృతికి  సంతాపం తెలిపిన హరీష్ రావు.. అత్యంత ఆత్మీయుడు, సోదరుడు బిఆర్ఎస్ పార్టీ జనగామ జిల్లా అధ్యక్షుడు, జిల్లా పరిషత్ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి మృతి బాధాకరమన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన హరీష్ రావు.. బిఆర్ఎస్ పార్టీ వారి కుటుంబానికి అండగా ఉంటుందన్నారు. సంపత్ రెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని హరీష్ రావు అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

brs

సంబంధిత వార్తలు: