ఏపీలో తుపాన్ భయం.. ఈ జాగ్రత్తలు మస్ట్?
ప్రత్యేకించి పూరిగుడిసెలు ఉన్న ఎస్టీ కాలనీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. పునరావాస కేంద్రాల్లో మంచినీరు, నాణ్యమైన ఆహారం ఎటువంటి లోటుపాట్లు లేకుండా అందించాలి. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలి. కరెంటు లేని సమయంలో కూడా ఐసీయూ, వార్డులు పనిచేసేలా ఇన్వర్టర్లు, జనరేటర్లు ఏర్పాటు చేసుకోవాలి. రెసిడెన్షియల్ కళాశాలలు, పాఠశాలలను క్షుణ్ణంగా పరిశీలించాలి. బలహీన కట్టడాలు ఉన్న బిల్డింగ్ ల నుంచి సురక్షిత ప్రాంతాలకు విద్యార్థులను తీసుకెళ్లేలా చూడాలి. విద్యుత్ శాఖ అధికారులు కరెంట్ వైర్లు, స్తంభాల ఇబ్బందులు రాకుండా పూర్తిగా అప్రమత్తంగా ఉండాలి.