జగన్‌ హయాంలో దళితుల గతి ఇంతేనా?

Chakravarthi Kalyan
ఆంధ్రప్రదేశ్ లో ఎస్సీలకు మాట్లాడే హక్కు లేకుండా చేస్తున్నారని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి మండిపడుతున్నారు. రాష్ట్ర హోంమంత్రి నియోజకవర్గంలోనే ఎస్సీ యువకుడు అవమానంతో పురుగుల మందుతాగి చనిపోయాడని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆరోపించారు. ఎస్సీ యువకుడి ఆత్మహత్య చేసుకుంటే వైసీపీ సామాజిక బస్సు యాత్రద్వారా ఏం సందేశం ఇస్తోందని పురంధేశ్వరి ప్రశ్నించారు.

కచ్చితంగా ఏపీలో అరాచక పాలన నడుస్తోందని.. నాఎస్సీ నాఎస్టీ అని చెప్పుకునే జగన్ ఆ కుటుంబానికి ఏం న్యాయం చేశారని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి నిలదీశారు. బీజేపీ ఎప్పటికీ రాజధానిగా అమరావతికే కట్టుబడి ఉందని.. రాజధాని కాబట్టే రైతులకు  కేపిటల్ గెయిన్స్ కింద కేంద్రం పన్ను మినహాయింపు ఇచ్చిందని.. రాష్ట్రంలో ఇసుక మాఫియా అడ్డ గోలుగా గోదావరి నదీ గర్భంలో తవ్వకాలు చేసేస్తోందని పురంధేశ్వరి అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: