ఇవాళ తెలంగాణకు అమిత్షా.. సుడిగాలి టూర్?
గద్వాల్ సభ అనంతరం అమిత్ షా నల్గొండకు వెళ్లనున్నారు. నల్గొండ, వరంగల్ లో నిర్వహించే సభల్లో అమిత్ షా పాల్గొంటారు. వరంగల్ సభ ముగించుకున్న తర్వాత అమిత్ షా హైదరాబాద్ కు వస్తారు. భాజపా మేనిఫెస్టోను అమిత్ షా విడుదల చేస్తారు. సికింద్రాబాద్ క్లాసిక్ గార్డెన్లో ఎమ్మార్పీఎస్ నేతలతో అమిత్ షా సమావేశం కానున్నారు. సమావేశం తర్వాత రాత్రి 8గంటలకు ప్రత్యేక విమానంలో అహ్మదాబాద్ కు వెళ్తారు.