తెలంగాణ బీజేపీ చివరి అస్త్రంగా అమిత్‌షా?

Chakravarthi Kalyan
తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఏమంత బాగా లేదు. ఏడాది క్రితం ఉన్న జోష్ ఇప్పుడు ఆ పార్టీలో కనిపించడం లేదు. ఇప్పుడు తెలంగాణలో పోటీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యనే కనిపిస్తోంది. అయితే.. బీజేపీ మాత్రం అగ్రనేతలను తీసుకొచ్చి ప్రచారం చేయిస్తోంది. ఇటీవలే మోడీ రెండు సార్లు వచ్చి హైదరాబాద్‌లో సభలు పెట్టారు. ఇక ఇప్పుడు ఈ నెల 18న తెలంగాణకు అమిత్ షా రాబోతున్నారు.


అదే రోజున అమిత్‌ షా బీజేపీ మేనిఫెస్టో విడుదల చేయనున్నారు. సోమాజిగూడలోని భాజపా మీడియా సెంటర్ లో కేంద్ర మంత్రి అమిత్‌ షా మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. అంతే కాదు.. అదే రోజు కేంద్ర మంత్రి అమిత్‌ షా తెలంగాణలో సుడిగాలి పర్యటనలు నిర్వహిస్తారు. ఒక్కరోజే 4 సభలకు కేంద్ర మంత్రి అమిత్‌ షా హాజరవుతారని తెలుస్తోంది. నల్లగొండ, వరంగల్, గద్వాల్, రాజేంద్ర నగర్ సభల్లో కేంద్ర మంత్రి అమిత్‌ షా పాల్గొంటారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp

సంబంధిత వార్తలు: