షాకింగ్‌: ఆంధ్రప్రదేశ్‌లో 13 లక్షల ఓట్లు తీసేశారు?

Chakravarthi Kalyan
ఏపీలో ఎన్నికల సంఘం ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల చేసింది. దీని ప్రకారం ముసాయిదా జాబితా ప్రకటించే నాటికి రాష్ట్రంలో తొలగించిన ఓట్ల సంఖ్య 13,48,203. ఈ ఓట్లు ఎందుకు తొలగించారంటే.. ఇందులో మృతి చెందిన ఓటర్ల సంఖ్య 7 లక్షల 10 వేలుగా కమిషన్ పేర్కొంది. 5,78,625 మంది ఓటర్లు ఇతర ప్రాంతాలకు బదిలీ, పునరావృతమైన ఓటర్ల సంఖ్య 81,185గా కమిషన్ స్పష్టం చేసింది. 2023 తుది జాబితాతో పోలిస్తే ముసాయిదాలో కొత్తగా 2,36,586 మంది ఓటర్ల పెరుగుదల ఉంది.

ఇక జనాభాలో ఓటర్ల నిష్పత్తి 729గా నమోదైందని ఈసీ స్పష్టం చేసింది. ఓటర్ల ముసాయిదా జాబితా ప్రకారం స్త్రీపురుష ఓటర్ల నిష్పత్తి 1031గా నమోదైంది. రాష్ట్రంలో మొత్తం పోలింగ్ కేంద్రాల సంఖ్య 46,165. జిల్లాల వారీగా అనంతపురం జిల్లాలో అత్యధికంగా 19,79,775 మంది ఓటర్లు ఉన్నారు. అత్యల్పంగా అల్లూరి జిల్లాలో 7,40,857 మంది ఓటర్లు ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: